హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
సాయంత్రం 5:30 గంటల వరకు అత్యధికంగా కుత్బుల్లాపూర్లోని షాపూర్నగర్లో 4 సెం.మీలు, నేరెడుమెట్లో 3.5 సెం.మీలు, జీడిమెట్లలో 3.3 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 3.1 సెం.మీలు, షేక్పేటలో 2.6 సెం.మీలు, మచ్చబొల్లారంలో 2.5 సెం.మీలు, జూబ్లీహిల్స్లో 2.0 సెం.మీలు, అల్వాల్ కొత్తబస్తీలో 1.7 సెం.మీలు, మియాపూర్లో 1.4 సెం.మీలు, హస్తినపురంలో 1.3 సెం.మీలు, బహుదూర్పురాలో 1.2 సెం.మీలు, రాజేంద్రనగర్, కేపీహెచ్బి సీబీసీఐడి కాలనీలో 1.1 సెం.మీలు, జగద్గిరిగుట్టలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.