Hyderabad | సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్రమత్తతతో లేకుంటే ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అప్రమత్తమైంది. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 విద్యుత్ సర్కిళ్ల పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ వినియోగదారులతో పాటు ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగత్రలు
ముందస్తు అవగాహన ఉండాలి
వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల పక్కన నిలబడవద్దు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ను వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చు.
– నక్కా యాదగిరి, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్