సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం నగరవ్యాప్తంగా వాన దంచి కొట్టింది. సోమవారం రాత్రి 10 గంటల వరకు రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లిలో 6.48 సెం.మీ, చార్మినార్ 6.33 సెం.మీ. గోల్కొండ 5.85 సెం.మీ., అంబర్పేట 5.75 సెం.మీ., బహదూర్పుర 5.65 సెం.మీ. శేరిలింగంపల్లి 5.43 సెం.మీ. ఖైరతాబాద్ 5.1 సెం.మీ, షేక్పేట 4.9 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు నగరానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డా.నాగరత్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్ సూచించారు. వర్షాభావ పరిస్థితులపై సోమవారం వారు అధికారులతో సమీక్షించారు. సమీక్షలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పాల్గొనగా, వాటర్ లాగింగ్పై 193 ఫిర్యాదులు వచ్చాయని, గంటన్నర వ్యవధిలో 30కిపైగా ప్రాంతాల్లో నీటిని తొలగించినట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్సాగర్లో 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి 1340 క్యూసెక్కులు వదులుతున్నారు.