సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9.30 గంటల వరకు నాంపల్లిలో 2.1 సెం.మీలు, జూబ్లీహిల్స్, మాదాపూర్లో 1.8సెం.మీలు, సర్దార్మహల్, యాకుత్పురా, చార్మినార్లో 1.1 సెం.మీ., హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సీతాఫల్ మండిలో 1.0 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.7 డిగ్రీలు, గాలిలో తేమ 53 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.