సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ద్రోణి ప్రభావంతో నగర వాతావరణం చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.