శామీర్పేట, డిసెంబర్ 6: ప్రకృతి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అనిరెడ్డి దివేశ్రెడ్డి రైతులకు సూచించారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బి.ప్రసాద్రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. సేంద్రియ పద్ధ్దతుల్లో పంటలను సాగు చేయాలని అన్నారు.
గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో ఐదు అంచెల పద్ధ్దతి, కషాయాల గురించి కూరగాయల సాగు, అంతర పంటలు, మిశ్రమ పంటల ఉపయోగాలు, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్, మెడిసినల్ ప్లాంట్స్,కలుపు నివారణ పద్ధ్దతులు, మల్చింగ్ మొదలగు నేలను కాపాడే పూర్వపు పద్ధ్దతులను రైతులు, సందర్శకులకు ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు తెలంగాణలో 25 గ్రామాలను దత్తత తీసుకొంటామని తెలిపారు. అనంతరం బి.ప్రసాద్రెడ్డికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా చైర్మన్ నరేందర్రెడ్డి, కార్యదర్శి మట్ట రాజేశ్వర్రెడ్డి, సుకృప ఎన్జీవో అధ్యక్షురాలు కృపలత, టీడీఎఫ్ ఇండియా కోఆర్డినేటర్ ప్రవీణ్కుమార్, ఎన్జీవో విద్యార్థినీవిద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.