కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 24 : విద్యార్థులు సేవా దృక్పథంతో గుప్పెడు బియ్యాన్ని దానం చేయడం అభినందనీయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం కూకట్పల్లి స్వామివివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పీఎన్ఎం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సేకరించిన 60 క్వింటాళ్ల బియ్యాన్ని శివానంద ఆశ్రమం, అమ్మానాన్న ఆశ్రమం, వైదేహీసేవా ఆశ్రమం, లాసర్ల సింధూ సేవ ఆశ్రమం, సాయిసేవా సదన్కు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పాఠశాల దశలోనే విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు, తోటి విద్యార్థుల వద్ద గుప్పెడు బియ్యాన్ని తీసుకుని 60 క్వింటాళ్ల బియ్యాన్ని సిద్ధం చేయడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో విద్యర్థులు భాగస్తులు కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ హన్మంతరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్రెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు, సూర్యప్రకాశ్రావు, సూర్యారావు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.