మారేడ్పల్లి, ఫిబ్రవరి 6: బోయిన్పల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డుకు నూతన కమిటీ కొలువుదీరింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే సాయన్న సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా హారిక , వైస్ చైర్మన్గా చింతల వేణుగోపాల్రెడ్డిలతో పాటు, నూతన డైరెక్టర్లుగా దేవులపల్లి శ్రీనివాస్, ఏం. గిరిధర్, డి. శ్రీనివాస్గౌడ్, బండి రామకృష్ణ, మీనా భాస్కర్, బి. నారాయణ, షేక్ నయీం, ఎస్, సుషాంత్రెడ్డి, బి. భాస్కర్ ముదిరాజ్, జవహరిలాల్, శ్రీరాముల ప్రభాకర్లు డైరెక్టర్లుగా సెక్రటరీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…బోయిన్పల్లి మార్కెట్కు ఎంతో మంచి పేరు ఉందన్నారు. కమిటీ సభ్యులందరూ కలిసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం నూతనంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాగెరి హారిక ఆనంద్బాబు మాట్లాడుతూ…మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రు లు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే జి. సాయన్న, మైనంపల్లి హన్మంతరావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
అభినందనల వెల్లువ..
మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కంటోన్మెంట్, మల్కాజ్గిరి ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్త కమిటీ బృందానికి నాయకులు జంపన ప్రతాప్, రాఘవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్ , ముప్పిడి మధుకర్, లోక్నాథం, నళిని కిరణ్ ,పిట్ల నాగేష్ ముదిరాజ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.