కీసర, ఏప్రిల్ 20 : ఈ-మెయిల్, ఇంటర్నెట్ ద్వారా మైనర్లను వేధిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మల్కాజిగిరి జోన్ సైబర్ క్రైమ్ డీసీపీ డాక్టర్ బి. అనురాధ, మల్కాజ్గిరి డీసీపీ ధీరావత్ జానకీ హెచ్చరించారు. కీసర మండలం గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలో గురువారం రాచకొండ సీపీ చౌహాన్ ఆదేశానుసారం రాచకొండ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ స్టాకింగ్, సైబర్ బూయింగ్ మీద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెయిల్ ద్వారా ఎవరైనా బెదిరిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930, లేదా www.cybercrime.gov.in కు సమాచారాన్ని అందించాలని సూచించారు. 100 డయల్ చేయాలని, 9490617111 వాట్సప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రవీందర్రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, ఏసీపీ సైబర్ క్రైమ్ ఏసీపీ జి. వెంకటేశం, ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, రఘువీర్రెడ్డి, ఎస్సై మధు, గీతాంజలి కళాశాల ఆర్కేఎస్సీ కో-ఆర్డినేటర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.