వెంగళరావునగర్, నవంబర్ 9 : ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన యువతి (20) వెంగళరావునగర్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నది. ఏడాది కిందట ఇన్స్టాలో వరంగల్కు చెందిన రమేశ్ (25)తో ఏర్పడిన పరిచయం.. వారి మధ్య ప్రేమకు దారి తీసింది.
యువతితో సన్నిహితంగా మెలిగిన సమయంలో రమేశ్ ఆమె ఫొటోలు తీశాడు. మూడు నెలల కిందట రమేశ్ ప్రవర్తన నచ్చక.. అతడిని దూరం పెట్టసాగింది. ప్రియురాలి ఎడబాటు రమేశ్లో కోపం పెంచింది. మళ్లీ తనతో గడపాలని పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రియురాలిపై కక్షగట్టాడు. తనను కాదంటే.. సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.