సుల్తాన్బజార్,ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ నవయువక్ మండలి, సాంస్కృతిక ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలి, మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పురానాపూల్ వంతెన నుంచి అఫ్జల్గంజ్ శివాజీ వంతెన వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర స్వాభిమాన్ షడ్కరి సంఘటన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాజు శెట్టి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శోభాయాత్రలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయనను ఉత్సవ కమిటీ ప్రతినిధులు మదన్ జాదవ్, ఎల్కే షిండే, దిలీప్ జగ్తాప్, పవన్ షిండే, నివాస్ బికమ్, వినోద్ ఆయనను సన్మానించారు. అంతకు ముందు శోభాయాత్రలో శివాజీ మహారాజ్, జిజియా భాయి, మహారాణా ప్రతాప్, తాంతియా తోపే వంటి దేశ భక్తుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభకు విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.