అంబర్పేట, కాచిగూడ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గం అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
ఉద్యోగ నియమకాలతో పాటు గరిష్ట వయో పరిమితిని పదేండ్లకు పెంచడం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పడంతో నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో పెద్ద ఎత్తున టపాకులు కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు.
నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఫీవర్ దవాఖాన చౌరస్తాలో టపాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. బాగ్అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్బిల్డింగ్ చౌరస్తాలో టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో పార్టీ నాయకులు భూపతి లక్ష్మణ్, ఆర్కేబాబు, రాము, లక్ష్మీ తదితరులు మిఠాయిలు పంచిపెట్టారు. కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, ఓంప్రకాష్ యాదవ్ల ఆధ్వర్యంలో డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
బాగ్అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీరమణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.గిరిధర్గౌడ్, శ్రీనివాస్యాదవ్, మహేందర్నాథ్గౌడ్, సునీల్, హబీబ్, సాయి, ఆకాష్, ఫయాజ్, శ్యామ్, అఖిల్, బొట్టు విజయ్, బాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.