ఉప్పల్ జోన్ బృందం, ఏప్రిల్ 16 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లలో శనివారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో హనుమంతునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీధుల్లో భారీ గా శోభాయాత్ర నిర్వహించారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప్పల్ చిలుకానగర్లో రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రామంతాపూర్ వెంకట్రెడ్డినగర్ నుంచి పీఎస్ కాలనీలోని హనుమాన్ దేవాలయం వరకు హనుమత్ విజయోత్సవ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పొరేటర్ కక్కిరేణి చేతన ప్రారంభించారు.