సిటీ బ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): చేనేత పరిశ్రమ, నేతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా గోకూప్, గో స్వదేశీ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలకు చెందిన చేనేత వస్ర్తాలకు సంబంధించి ప్రదర్శనను కళింగ హాల్లో బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గోకూప్ సేల్స్, మార్కెటింగ్ జీఎం మాధవి నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు బీహార్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు చెందిన ప్రసిద్ధ చేనేత వస్ర్తాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్లు ఆమె పేర్కొన్నారు.