ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
హాల్టికెట్లను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని ఆయన సూచించారు. హాల్టికెట్లలో ఏమైనా మార్పులు ఉంటే పరీక్షకు ముందురోజే మార్చుకోవాలని నగేశ్ పేర్కొన్నారు.