మొదటి రోజు జోరుగా హలీం విక్రయాలు
చాంద్రాయణగుట్ట,ఏప్రిల్ 3: రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మసీదులో నమాజ్ సందర్భంగా ఇబ్బందులు కలుగకుండా మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. గాజులు, బట్టలు, అత్తార్, పండ్ల దుకాణాల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి.చాంద్రాయణగుట్ట,బాబానగర్,మిధాని,ఫలక్నుమా,షంషీర్గంజ్,సయ్యద్ అలీ చబుత్ర,శాలిబండ ప్రాంతా ల్లో హోటల్స్కు కొత్త కళ వచ్చింది.రంజాన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హలీం వంటకాలు అందించేందుకు హోటల్స్ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ప్లేట్ హలీం రూ. 220 నిర్ణయించారు.ఫ్యామిలీ ఫ్యాక్ రూ.880గా నిర్ణయించారు.డోర్ డెలివరి కూడా చేస్తున్నారు.మొత్తం మీద మొదటి రోజు నుంచే రంజాన్ సందడి కనిపించింది.