గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం నగరవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి. విభిన్న పూలు, రంగురంగుల కాంతుల్లో మెరిసిపోయాయి. దిల్సుఖ్నగర్లోని ఆలయంలో సాయిబాబాకు హారతి ఇస్తున్న అర్చకుడు.
నగరంలోని పలు దేవాలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే ఆలయాలకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
సీతారాంబాగ్లోని దత్తాత్రేయ ఆలయంలో, పద్మారావునగర్, చాదర్ఘాట్, సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఉన్న సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యార్థులు గురువులకు, అర్చకులకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.