ఖైరతాబాద్, జనవరి 7 : తెలంగాణ గుజరాతి సమాజ్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా ఆదివారం గుజరాతి గౌరవ్ ఏక్తా మహోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన గుజరాతీల గార్బా నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. వేలాది మందితో చేపట్టిన గౌరవ్ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ యాత్రను తెలంగాణ గుజరాతి సమాజ్ అధ్యక్షుడు ప్రేమల్ పారేఖ్, ఉపాధ్యక్షులు చందులాల్ పటేల్, మన్సుఖ్ పటగేల్, ప్రధానకార్యదర్శి మీనల్ వఖారియాతో కలిసి ప్రారంభించారు.
జలవిహార్ వరకు కొనసాగిన యాత్రలో గుజరాతీ మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులతో పాటు పగడీలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గుజరాతి సమాజ్ కోశాధికారి కృష్ణకాంత్ ఫారిక్, ఎక్తా మహోత్సవాల చైర్మన్ చేతన్ బోగాని, జస్మత్ పటేల్ పాల్గొన్నారు.