మణికొండ: కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల సర్కారు స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి.. నివాసముంటున్నామని, ఇప్పుడు హైడ్రా అధికారులు తమ ఇండ్లపై బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం సమాచారం ఇవ్వకుండా పేదల నివాసాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం సమంజసం కాదని పలువురు నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల స్థలాల్లో వేర్వేరుగా కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి నిర్మాణాలను చేపట్టి.. నివాసాలను ఏర్పర్చుకున్నారని వీటిపై స్థానికుల ఫిర్యాదుల మేరకు స్పందించి కూల్చివేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.