సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. బీడు భూములన్నీ పచ్చని అందాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధికారులు లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లో ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు 406 లే అవుట్లలోని ఖాళీ స్థలాలను పూర్తిగా గ్రీనరీగా మార్చారు. వేప, కదంబ, జువ్వి వంటి చెట్లతో పాటు మర్రి, చింతపండు, నేరేడు, పలు పూల మొక్కలతో గ్రీనరీగా మార్చారు. ఎల్బీనగర్ జోన్లో 104 ట్రీ పార్కులు, చార్మినార్లో 23, ఖైరతాబాద్లో 86, శేరిలింగంపల్లిలో 97, కూకట్పల్లిలో 56, సికింద్రాబాద్ 40 చోట్ల ట్రీ పార్కులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.