సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.7డిగ్రీలు తగ్గి 14.3డిగ్రీల సెల్సియస్గాను, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 48శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.