వెంగళరావునగర్, నవంబర్ 24 : అభివృద్ధి,సంక్షేమమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం రహ్మత్నగర్ డివిజన్ వినాయకనగర్లో రూ.4 లక్షలతో చేపట్టనున్న వాటర్ పైపులైన్ పనులకు, ఓం నగర్లో రూ.8 లక్షలతో చేపట్టన్ను సీవరేజీ పనులకు, వినాయకనగర్లో రూ.5.5 లక్షలతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీ పైపులైన్లు పెరిగిన ప్రస్తుత జనాభాకు చాలాడం లేదని..పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు.
ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎనిమిదేండ్ల తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు కేవలం ప్రజలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశాయని..తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో అందిస్తున్నామని పేర్కొన్నారు. లీకేజీలు జరగకుండా నాణ్యమైన పైపులైన్లను వాడేలా చూసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వాటర్వర్క్స్ అధికారులను సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, వాటర్ వర్క్స్ డీజీఎం వాహబ్, మేనేజర్ రాజేందర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సుబ్బరాజు,నాయకులు నాగరాజు, షరీఫ్, ప్రేమ్, యాదగిరి, సోని, లింగరాజ్, భవాని, జగన్, గని, మూర్తి, విలియం, వాణి, చందర్, రవిశంకర్, గఫూర్, చోటు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.