ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
బాలానగర్, ఏప్రిల్ 5 : ప్రణాళికాబద్ధంగా వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్లో కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి రూ.2.66 కోట్ల నిధులతో పలు శ్మశానవాటికలు, సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గౌతంనగర్ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.1.5 కోట్లు, కార్మికనగర్ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.75 లక్షలు, వెంకటేశ్వరనగర్ ముస్లిం గ్రేవ్యార్డ్ అభివృద్ధికి రూ.18 లక్షలు కేటాయించి ఆయా పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రూ.23 లక్షలతో హెచ్పీరోడ్డులో అభివృద్ధి పరిచిన శ్మశానవాటికను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వైకుంఠధామాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల వైకుంఠధామాల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆలోచన చేస్తూ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డివిజన్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రీదేవి, ఏఈ పవన్, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, నపారి చంద్ర శేఖర్, భిక్షపతి, సుదర్శన్రెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.