మెహిదీపట్నం, మార్చి 16 : శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. షబ్ ఎ బరాత్ వస్తుండటంతో శ్మశాన వాటికల్లో ముస్లింలు తమ ఇంటి పెద్దలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది..
సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం సకాలంలో పరిష్కరిస్తున్నదని నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. బుధవారం అహ్మద్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. పోచమ్మ, ఫస్ట్లాన్సర్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు పర్యటించారు. స్థానికులు డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు చేశారు. డ్రైనేజీల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన ఆనంద్కుమార్గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
వీధి దీపాలకు మరమ్మతులు
నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ న్యూ కిషన్నగర్లో వీధిదీపాల మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం అధికారులు బుధవారం చేపట్టారు. ఈ పనులను ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి ఎండీ.మూసా, ఇమ్రాన్ లీడర్తో కలిసి పరిశీలించారు.