కుత్బుల్లాపూర్, నవంబర్26: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. భక్తుల పాలిట కొంగుబంగారంగా రేణుకా ఎల్లమ్మ తల్లి నిలిచిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజ్, కార్పొరేటర్లు కొలన్ వీరేందర్రెడ్డి, ఆగం పాండు, ఆగం రాజు, కాసాని సుధాకర్, విజయలక్ష్మి వెంకటసుబ్బారావు, బాలాజీనాయక్, సుజాత, కోఆప్షన్ సభ్యులు తలారి వీరేశ్, మాజీ ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, నిజాంపేట్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నాయకులు జగన్, వెంగయ్యచౌదరీ, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు..
దుండిగల్ మున్సిపాలిటీలోని భౌరంపేట బంగారు మైసమ్మ ఆలయంలో కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ ఆధ్వర్యంలో పూజలు చేశారు. కార్తిక మాసం సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసింది. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మురళీయాదవ్, విష్ణువర్ధన్రెడ్డి, సునీల్, కిషన్, ఆలయ కమిటీ సభ్యుడు సుభాష్ పాల్గొన్నారు.