శంషాబాద్ రూరల్, మే 26 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని మల్కారం గ్రామం లో పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ ఆధ్వర్యంలో గోడౌన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద పీటవేస్తుందని వివరించారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడం కోసం గోడౌన్లు నిర్మాణం చేస్తే రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న సమయంలో అమ్ముకోవచ్చునని తెలిపారు.
నాబార్డు నిధుల నుంచి రూ. 1.70 లక్షలతో పనులు ప్రారంభించిన్నట్లు చెప్పారు. కేవలం 7 నెలలలోపు పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, సర్పంచ్లు మాధవియాదగిరిరెడ్డి,దండుఇస్తారి, రాంగోపాల్, రమేశ్యాదవ్, ఎంపీటీసీ క్రాంతికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్, డైరెక్టర్లు కాసుల బాల్రాజ్గౌడ్,శంకరయ్య, హిరేకార్ శివాజీ, దర్గా సత్తయ్య, దిద్యాల శ్రీనివాస్, నీరటి రాజు ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్,పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, రైతు విభాగం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి,కొమ్మ గోపాల్ నాయకులు పాల్గొన్నారు.