Musi Beautification : మూసీ సుందరీకరణపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు నిజమేనని నిరూపితమైంది. మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనని ప్రభుత్వ ప్రజెంటేషన్తో తేలిపోయింది. మూసీ ఒడ్డున నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 గురించి వివరిస్తూ.. 3 వేల ఎకరాల పైనే సేకరిస్తున్నామని చెప్పారు. తద్వారా సామాన్యులకు సంబంధించిన వేల ఎకరాల భూమిని సేకరించి అమ్ముకోవడం, దరిదాపుల్లోని ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టడం… ఇవే మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ అనే విషయం మాత్రం స్పష్టం అయింది.
ఇన్నాళ్లూ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్, ఇతరట్టడాలు కూలగొట్టి అక్కడ ఏం చేస్తారో అనే విషయంలో కొంత అస్పష్టత ఉండేది. కానీ, ఇవ్వాళ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్లో అక్కడ ఏం రానుందో ఐఏఎస్ అధికారి వెంకట్ నర్సింహా రెడ్డి చాలా స్పష్టంగా వివరించారు. మొదటి నుండి భయపడ్డట్టే మధు పార్క్ రిడ్జ్ వంటి అపార్ట్మెంట్లు, సమీపంలోని ఇండ్లు కూల్చి అక్కడ ఒక పెద్ద జెయింట్ వీల్, ఆ పక్కనే అనేక కమర్షియల్ భవంతులు కట్టనున్నారు.
ఇవ్వాళ్టి ప్రజెంటేషన్లో మూసీ ప్రాంతాన్ని ఎలా “అభివృద్ధి” చేయాలనుకుంటున్నారో ఒక ఊహా చిత్రం చూపించారు. అందులో చాలా స్పష్టంగా జెయింట్ వీల్, కమర్షియల్ భవంతులు సరిగ్గా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉన్న స్థలంలోనే రాబోతున్నాయి. దీంతో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అనేది ఒక ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని స్పష్టమైపోయింది.
బిగ్ బ్రేకింగ్!
మొదట్నుండి చెప్పిందే నిజమైంది!
మూసీ ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే!
ఫేజ్ 1 గురించి చెప్తూ 3 వేల ఎకరాలు పైనే సేకరిస్తున్నామని చెప్పారు
సామాన్యులకు సంబంధించిన వేల ఎకరాలు సేకరించి అమ్ముకోవడం, ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మడం ఇదే మూసీ ప్రాజెక్ట్… pic.twitter.com/JnzMQLxVWm
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2026