అత్తాపూర్, నవంబర్ 4: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్లోని రతన్నగర్లో రూ. 15లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నియోజకర్గంలోని అన్ని బస్తీలు, కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మునుపెన్నడు లేని విధంగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
రానున్న రోజులో ్లరాజేంద్రనగర్ సర్కిల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మరిన్ని సమస్యలు తెలపడంతో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, అమరేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, నాయకులు, సుభాశ్రెడ్డి, చిత్తారి, సురేశ్రెడ్డి, శంకర్, శ్రీనివాస్గౌడ్, సత్యనారాయణ గౌడ్, పియం రెడ్డి, శ్రీధర్రెడ్డి, రవి , కొమురయ్య, చిన్నా, నరేందర్రావు, వెంకటేశ్, మహేశ్, సుధాకర్, విజయ్కుమార్, సతీశ్, రాజు పాల్గొన్నారు.
కంటి వెలుగును వినియోగించుకోవాలి
బండ్లగూడ,జనవరి 9: ప్రజలందరికీ ఆరోగ్య వంతమైన జీవితాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.సోమవారం రాజేంద్రనగర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు అధికారులతో పాటు స్థానిక నాయకులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జగన్, యూసీడీ ప్రాజెక్ట్ అధికారిని రాధారాణి, కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, సంగీత గౌరీశంకర్ పాల్గొన్నారు.