సికింద్రాబాద్, జనవరి 4: ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు బుధవారం కార్ఖానాలో తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు గాను సుమారు రూ.23లక్షల 2,668 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం చేస్తూ ఆడ బిడ్డల కుటుంబాలను ఆదుకుంటున్నారని కొనియాడారు. త్వరలోనే నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు పథకం అమలుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ఆయా మండలాల తాసీల్దార్లు, నేతలు నివేదిత, సరిత, ముప్పిడి మధుకర్, వేణుగోపాల్రెడ్డి, సదానంద్గౌడ్, మురళీయాదవ్, భాస్కర్, సంతోష్, కిరణ్కుమార్, శ్రీహరి, తేజ్పాల్ తదితరులు పాల్గొన్నారు.