మణికొండ, ఫిబ్రవరి 1: భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని బుధవారం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని, మన ఊరు-మన బడి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదని గుర్తుచేశారు.
ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభు త్వం ప్రత్యేకంగా చొరవతో నిధులు కేటాయిస్తోందన్నా రు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ప్రస్తు తం కార్పొరేట్కు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్లు పెరగడంతో పాటు విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం, నాణ్యమైన విద్యను తెలంగాణ సర్కారు అందిస్తోందన్నా రు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడు ల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లు సునీత గణేశ్కుమార్, విజిత ప్రశాంత్యాదవ్, మండల విద్యాధికారి రాంరెడ్డి పాల్గొన్నారు.