శామీర్పేట, మార్చి 13 : దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను సొంతం చేసుకుంటున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలువురు వ్యాపార, పారిశ్రామిక వేత్తలు లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ అన్ని హంగులను కల్పిస్తున్నారు. ఇదే తీరుగా శామీర్పేట మండలం అలియాబాద్ మల్లన్నగుడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాత శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్.రావు అందించిన నిధులతో సర్వాంగ సుందరంగా మారింది. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఎదిగింది. పనులు పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభోత్సవానికి పూర్తి చేసుకుంది.
దాతల సహకారం.. అలియాబాద్ మల్లన్నగుడి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో నాటి ఎస్ఎంసీ చైర్మన్ కంట మల్లేశ్ విద్యాశాఖ, జిల్లా యంత్రాంగాలు, దాత తాళ్ల జగదీశ్గౌడ్ సహకారంతో పురాతన భవాన్ని కూల్చివేసి, అదే స్థలంలో నూతన భవన నిర్మాణం కోసం సర్పంచ్ గుర్క కుమార్యాదవ్, జడ్పీటీసీ అనితలాలయ్య విన్నపం మేరకు మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి చొవరతో శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్. రావు రూ.60 లక్షలు మంజూరు చేశారు. దీంతో జీ 1లో 6 తరగతి గధుల నిర్మాణం, టాయిలెట్స్, ప్రార్థన స్థలం, తరగతి గదిలో విద్యార్థులను ఆకర్శించే విధంగా బొమ్మలతో కూడిన ఆంగ్ల, తెలుగు, గణిత అక్షరాలో చిత్రాలను ఏర్పాటు చేశారు.
సంతోషంగా ఉన్నది..
శిథిలావస్థకు చేరిన పాఠశాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాతల సహకారంతో కల నెరవేరింది. విశాలమైన తరగతి గదు లు, ఇంటీరియల్ డిజైనింగ్తో సుందరంగా పాఠశాలను తీర్చిదిద్దారు. దాతలకు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు.
– పుష్పలత, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు
దాతలకు రుణపడి ఉంటా..
పాఠశాల అభివృద్ధికి స హకరించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డా క్టర్ బీఎస్. రావుకు జీవితాంతం రుణపడి ఉం టాం. అలాగే ఇందుకు కృషి చేసిన మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డికి కృతజ్ఞతలు.
– గుర్క కుమార్, సర్పంచ్