సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు బల్దియాలో పదవీ విరమణ పొంది ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న అధికారులను ఇంటికి పంపించే ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్కుమార్ను పంపించారు. ఈ స్థానంలో ఐఏఎస్ అధికారి శివకుమార్ నాయుడుకు బాధ్యతలు అప్పగించారు.
ఫైనాన్స్ విభాగం జాయింట్ కమిషనర్గా ఉన్న కెనడీని ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఈ స్థానంలో ఎస్టేట్ విభాగం అదనపు కమిషనర్గా ఉన్న గీత రాధికకు అదనంగా ఫైనాన్స్ బాధ్యతలు అప్పగించారు. మరో రిటైర్డ్ అధికారిణి అనురాధ వచ్చే నెలాఖరు వరకు మాత్రమే కొనసాగనున్నారు.