Hydraa | హైడ్రాకు మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. 169 మందిని డెప్యూటేషన్పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుల్స్ని నియమించింది. అలాగే, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను హైడ్రాకు డిప్యూటేషన్పై సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. హైడ్రా మూసి నది ఆక్రమణల కూల్చివేతలపై దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులు 1,350 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇండ్లకు మార్క్ చేసింది. మరో వైపు కలెక్టర్లు, అధికారులు మూసి నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించారు. మూసి ఆక్రమణల వివరాల ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు సేకరించారు. శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేయనున్నారు. గోల్నాక, చాదర్ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో మూసిని ఆనుకొని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసింది.