ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం పూజ సందర్భంగా అమ్మవారి ఆలయానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు.
మెహిదీపట్నం, జూలై 6: ఆషాఢ మాసం బోనాల్లో భాగంగా చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం అభిషేకం చేసి..అమ్మవారి ముందు నవధాన్యాలతో పటం గీసి పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శ్రీనివాస రాజు, అర్చకులు సర్వేశ్వర్ చారి, ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్ చర్యలు చేపట్టారు. ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.