సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముగ్గురు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ..ప్రభుత్వం సోమవారం జీవోను జారీ చేసింది. హైదరాబాద్ యూఎల్సీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఎల్.రమాదేవిని కీసర ఆర్డీవోగా, జహీరాబాద్ ఆర్డీవోగా పనిచేస్తున్న కె.వెంకటరెడ్డిని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మరో డిప్యూటీ కలెక్టర్ అయిన ఎస్.రాజేశ్కుమార్ను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.