సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో కొనసాగుతున్న 35వ పుస్తక పండుగ సందర్శకులతో కిక్కిరిసిపోతున్నది. శనివారం పలువురు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వల్లో’ పుస్తకాన్ని చరిత్రకారులు ప్రొఫెసర్ యశ్వంత్ రామమూర్తి ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైందని పేర్కొన్నారు. ఈ నగరంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఈ పుస్తకం ఉపయోడపడుతుందని చెప్పారు. ప్రభుత్వం కూడా తెలంగాణ చరిత్రను, సంసృతులను పరిరక్షించేందుకు చాలా కృషి చేస్తుందని, అందుకు ఈ పుస్తకం ఎంతో సహాయకారిగా ఉంటుందని అభిప్రాయపడ్దారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ,దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ మణికొడ ప్రొఫెసర్ అంజన్న, అనంద్రాజ్, డాక్టర్ ఎస్.రఘు పాల్గొన్నారు.
సిరి పెయింటింగ్ అకాడమీ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, సిరి స్వామి విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. అలాగే సుప్రియ గెహ్లాట్ రచించిన ‘40 సెకండ్స్’ పుస్తకాన్ని జూలూరు గౌరీశంకర్ ఆవిషరించారు. కార్యక్రమంలో సీనియర్ మానసిక వైద్యులు నాగేంద్రరావు, రోషిణి ఫౌండేషన్ డైరెక్టర్ ఉషాశ్రీ, జ్యోతి, పాల్గొన్నారు.
హిందీ సదస్సు..
డాక్టర్ సర్రాజ్ ఆధ్యర్యంలో హిందీ సదస్సు నిర్వహించారు. హిందీలో రాసిన పలు కవుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రో వైస్ చాన్స్లర్ సర్రాజ్ మాట్లాడుతూ దేశ సమైక్యతను హిందీ భాష పరిరక్షిస్తుందన్నారు. ఆయా రాష్ర్టాల భాషలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ మాజీ ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి, రాష్ట్ర ఫార్మసీ, బీఎడ్ కళశాలల సంఘం అధ్యక్షులు డాక్టర్ కె.రామదాస్, బుక్ ఫెయిర్ సెక్రటరీ శృతికాంత్ భారతి, పాల్గొన్నారు.
నేడు పుస్తక ప్రదర్శన ముగింపు సభ
ఆదివారం బుక్ఫెయిర్ ముగియనుంది. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎస్ సోమేశ్కుమార్, అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్టమోహన్, క్రీడా సాంసృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య చైర్మన్ భరత్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి హాజరుకానున్నారు.
కలలు అందంగానే ఉంటాయి..
నందిని సిధారెడ్డి
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి జూలూరు గౌరీశంకర్, డాక్టర్ కొండా నాగేశ్వర్తో సంభాషణ నిర్వహించారు. సిధారెడ్డి మాట్లాడుతూ.. ఏదైనా సంఘాన్ని నిర్మించాలంటే ముందుగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పడుతుందని అన్నారు. ఆ వెలుగులో సంఘాల నిర్మాణం జరగాలన్నారు. తాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా స్టడీ సరిల్ ఏర్పాటు చేసి అనేక సామాజిక సాంసృతిక చర్చలు జరిపేవారమన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ.. ప్రపంచ యవనికపై తెలంగాణ సాహిత్య ప్రభావం బలమైన ముద్రవేసిందని పేరొన్నారు.
అనతరం జరిగిన సాహిత్య చర్చలో ప్రముఖ రచయిత రాజేందర్ జింబో రచనలు వేములవాడ కథల పై రచయితతో జూలూరు గౌరీ శంకర్, డాక్టర్ నాగేశ్వర్ వివిధ అంశాలపై వేముల వాడ ప్రాంత జానపద సాహిత్యం పై చర్చించారు. డాక్టర్ ప్రభాకర్రావు, దీప్తి రచించిన యోగాముద్ర పుస్తకాలను ఆవిష్కరించారు.