మహేశ్వరం : కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రావిరాల మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో 100 మంది మత్య్యకారులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మార్కెటింగ్ కోసం వాహనాలను సమకూర్చాలని మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల వృత్తుల వారికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. అన్ని వర్గాలు, కులాల వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారని అన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి వారి జీవనోపాధికి వాహనాలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు జిల్లెల లక్ష్మయ్య నాయకులు శేఖర్రెడ్డి, నర్సింహ్మ, నాగేశ్వర్గౌడ్ మత్యకారుల సంఘం అద్యక్షులు గుంటి గణేష్ మత్స్యకారులు పాల్గొన్నారు.