చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు చర్యలో భాగంగా కరోనాను కట్టడి చేసేందుకు జ్వర సర్వేను ప్రవేశపెట్టారని అన్నారు. జ్వర సర్వేలో మెడికల్ కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు.
పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జయసింహ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఎరం శ్రీనివాస్ గుప్తా, మారిశెట్టి నర్సింగ్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్,గడ్డమీది శ్రీనివాస్, వనజ,లక్ష్మి,ముచ్చకుర్తి పద్మ, హన్మంతు, దేవయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.