హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 410 గ్రాముల బంగారాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 20.3 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.