శంషాబాద్ రూరల్, డిసెంబర్ 11: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులలో బంగారాన్ని దాచి తీసుకొచ్చాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు.. ఆ ప్రయాణికుడిని గుర్తించి తనిఖీ చేశారు. అతడి వద్ద బంగారం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.