హయత్నగర్, సెప్టెంబర్ 15: విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఆలిండియా నవ్ సైనిక్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్లో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ క్యాడెట్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలకు చెందిన బీకాం థర్డీయర్ ఎన్సీసీ విద్యార్థిని ఎం.ఝాన్సీ సెమఫోర్లో గోల్డ్ మెడల్, సెకండియర్ విద్యార్థి రామ బ్రహ్మచారి షిప్ మోడలింగ్లో గోల్డ్ మెడల్ వ్యక్తిగత విభాగాల్లో వేర్వేరుగా సాధించారని తెలిపారు. ఎన్సీసీ నేవీ విభాగం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి ఒక యూనిట్ నావెల్, ఎన్సీసీ యూనిట్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ నావెల్ యూనిట్ ఎన్సీసీకి కంటింజెంట్ కమాండర్గా కళాశాల ఎన్సీసీ విభాగం ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ ధన్రాజ్ వ్యవహరించారని తెలిపారు. తెలంగాణ నుంచి 30 మంది ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారని, వారిలో హయత్నగర్ డిగ్రీ కళాశాల నుంచి 13 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారని తెలిపారు. ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన క్యాడెట్స్ని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇంతియాజుద్దీన్ ఫారూఖీ, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.