కాచిగూడ,ఆగస్టు 30 : రేపల్లె ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి బ్యాగులోంచి గుర్తు తెలియని వ్యక్తులు 40 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. రామోజీ ఫిల్మ్సిటీ, అనాజీపూర్ ప్రాంతానికి చెందిన సామ్యెల్ భార్య కె.లక్ష్మి(41)వృత్తిరీత్యా రామోజీఫి ల్మ్సిటీలోని తార హోటల్లో పనిచేస్తుంది.
ఈ నెల 26వ తేదీన రేపల్లెలోని వినుగొండ ప్రాంతానికి బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి ఈ నెల 27న రేపల్లె రైల్వేస్టేషన్లో రేపల్లె-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్కు వచ్చింది.
28వ తేదీన ఇంటికి వెళ్లి లక్ష్మి చూసుకునేసరికి బ్యాగులో ఉన్న బ్యాగులో 40 గ్రాముల బంగారు అభరణాలు కన్పించలేదు. ఆదివారం రాత్రి కాచిగూడ రైల్వే పోలీసులకు లక్ష్మి పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.