హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి నుంచి రూ. 59.23 లక్షల విలువ చేసే 1190.60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని పురీష నాళంలో దాచి తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.