ఎల్బీనగర్/ వనస్థలిపురం, ఏప్రిల్ 3 : తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ మాంసం మార్కెట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశుభ్రతతో ఒకేచోట 60 రకాల మాంసాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. వనస్థలిపురం పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, కటికరెడ్డి అరవింద్రెడ్డి, బూడిద నందారెడ్డి, నాగేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంకీర్తన్ యాదవ్ను అభినందించిన..
కుస్తీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి, రాంచీలో ఈనెల 15,16 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న చైతన్యపురికి చెందిన తోట సంకీర్తన్ యాదవ్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని సూచించారు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన కోరారు. క్రీడలు మానసిక శక్తిని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, కొత్తపేట యాదవ సంఘం సలహాదారులు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, శరత్చంద్ర, వరుణ్చంద్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.