శంషాబాద్ రూరల్, డిసెంబర్ 4 : తుఫాన్ కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి, చెన్నై ఎయిర్పోర్టులకు వెళ్లే 25 విమానాలను రద్దు చేసినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 5.35 నిమిషాల నుంచి రాత్రి వరకు పది విమానాలు రద్దు చేశారు. దీంతో పాటు తిరుపతి వెళ్లే నాలుగు విమానాలు, విజయవాడ ఒకటి, రాజమండ్రి మూడు విమానాలు, విశాఖపట్నం మూడు, అహ్మదాబాద్ ఒకటి, పుణె ఒకటి ఇలా మొత్తం 25 విమానాలు రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం అనుకులంగా లేకపోవడంతో విమానాలను రద్దు చేశామని వివరించారు. ప్రయాణికులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.