ముషీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన కేక్లు కట్ చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ముషీరాబాద్ పార్శిగుట్ట చౌరస్తాలో టీఆర్ఎస్ సీనియర్ నేత టీ. సోమసుందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముషీరాబాద్ చౌరస్తాలో డి.శివముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆశా వర్కర్స్లు, పారిశుద్ధ్య కార్మికులకు జ్యూస్ పంపిణీ చేసి రేయిన్బో ఆశ్రమంలో అన్నదానం చేశారు.
అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసి, మొక్కలు నాటారు. అడిక్మెట్ ఎస్విఎస్ స్కూల్లో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేశారు.
రాంనగర్లో డివిజన్ అధ్యక్షుడు మోజస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్శిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా కవాడిగూడలో డివిజన్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి మొక్కలు నాటారు .