DPS | హైదరాబాద్ : నాదర్గుల్ డీపీఎస్(ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో పీఈటీ వికృత చేష్టలు బయటపడ్డాయి. 13 ఏండ్ల వయసున్న ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పీఈటీపై ఆరోపణలు వచ్చాయి. ఆ విద్యార్థిని పట్ల ప్రతి రోజు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు తమకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు పీఈటీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నెల రోజుల క్రితమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రకాశ్ అనే వ్యక్తి పీఈటీగా నియామకం అయ్యాడు. అయితే బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచారు. విచారణ అనంతరం ప్రకాశ్పై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.