ముమ్మరంగా ముంపు నివారణ పనులు
వేగంగా నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు
కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తి
పలు విభాగాల ద్వారా రూ.2250 కోట్ల పనులు
రూ.94 కోట్లతో వరద నివారణ ప్రత్యేక పనులు
ఇప్పటివరకు 3.39 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపు
47 చెరువుల వద్ద చేపట్టిన పనులు పూర్తి
సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో పాటు చెరువుల వద్ద కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నాలాల అభివృద్ధి, పూడికతీత, మైనర్ నా లా రిటర్నింగ్ వాల్, బాక్స్ నిర్మాణాలు, చెరువుల నుం చి వరద నియంత్రణకు నూతన స్లూయిస్ నిర్మాణాలు, ఇప్పటికే ఉన్న వాటికి మరమ్మతులు, ఇలా అన్ని కోణా ల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. గతంలోని అనుభవాల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతా ల్లో ముంపు సమస్యను అంచనా వేసి.. వివిధ విభాగా ల ద్వారా రూ.2250 కోట్ల విలువైన పనులను చేపట్టారు. రూ.415 కోట్లతో ఇంజినీరింగ్ మెయింటనెన్స్, రూ.1006 కోట్లతో ప్రాజెక్టు విభాగం ఎస్ఎన్డీపీ, రూ. 735 కోట్లతో చెరువుల మరమ్మతులు, రూ.94 కోట్లతో వరద నివారణ ప్రత్యేక పనులు చేపట్టారు. ప్రస్తుతం వీటిలో కొన్ని పూర్తవగా, కొన్ని కొనసాగుతున్నాయి.