సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం అవశేషాల తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు హుస్సేన్సాగర్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 1,333 ట్రిప్పుల్లో 7,331 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలగించారు.
గ్రేటర్వ్యాప్తంగా పది రోజులలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 7,124 ట్రిప్పుల్లో 80202 మెట్రిక్ టన్నుల అవశేషాలను తరలించారు. గ్రేటర్లో ఏర్పాటు చేసిన మండపాలు, 74 కొలనుల వద్ద 10 వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటల పాటు పనిచేస్తూ నిమజ్జన అవశేషాలను సేకరిస్తున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.