ఇప్పటి వరకు రూ.1.32 కోట్ల ఆస్తిపన్ను వసూలు
పథకంపై విస్తృతంగా అధికారుల ప్రచారం
అబిడ్స్, ఏప్రిల్ 16: నగరంలోని గృహ యజమానులు వారి ఆస్తి పన్నును ముందుగా చెల్లిందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబేటును ఇస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆస్తి పన్ను చెల్లించి ఐదు శాతం రిబేటు పొందేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.32 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కాగా మిగిలిన 14 రోజుల్లో పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం ఎర్లీ బర్డ్ పథకం కింద దాదాపు రూ.20కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కాగా ఈ సంవత్సరం కూడా అదే మొత్తంలో ఆస్తి పన్ను వసూలు చేసేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఆస్తిపన్ను వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడతో పాటు బ్యానర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలు ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కార్యాలయాలకు వచ్చి ఆస్తిపన్ను చెల్లించేందుకు వెనకాడుతున్నా రు. ఇదిలా ఉండగా భవన యజమానులు ఎర్లీ బర్డ్ పథ కం ద్వారా 5 శాతం రిబేటు ఇవ్వడంతో ముందస్తు చెల్లింపులను ఆన్లైన్లో చేస్తున్నారు. జీహెచ్ఎంసీ14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో అధిక మొత్తంలో ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీబర్డ్ పథకాన్ని సద్వినియో గం చేసుకొని రిబేటు పొందండి. ఏప్రిల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబే టు వస్తుంది. ఎర్లీ బర్డ్పై ప్రజల కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. కరోనా నేపథ్యంలో అత్యధికులు ఆన్లైన్లో చెల్లింపులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉండడంతో ఆ లోపు భారీగా ఆస్తి పన్ను వసూలయ్యేలా ప్రచారం చేస్తాం. -శ్రీనివాసు, జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్